Andhra Pradesh: జగన్ అడుగుజాడల్లో కర్ణాటక సీఎం.. మా ఉద్యోగాలు మాకే అంటున్న యడియూరప్ప!

  • ఏపీలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేనన్న ప్రభుత్వం
  • అదే తరహాలో ముందుకెళుతున్న యడియూరప్ప
  • మెజారిటీ ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ బాటలోనే కర్ణాటక నడుస్తోంది. కర్ణాటకలో మెజారిటీ ఉద్యోగాలు కన్నడిగులకే దక్కాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగా తాము చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.

క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ మేం పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతామని యడియూరప్ప చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన యడియూరప్ప.. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జతచేశారు.

More Telugu News