Assom: కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రికి యావజ్జీవ జైలు శిక్ష!

  • కన్నబిడ్డపై రెండేళ్లు దాష్టికం
  • ఇంట్లోంచి పారిపోయిన పాప
  • రెండున్నరేళ్ల తరువాత తీర్పు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డపై రెండేళ్లపాటు అత్యాచారం చేసిన దుర్మార్గుడికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. ఇంతటి మానవ మృగం సభ్య సమాజంలో నివసించేందుకు అర్హుడు కాదని, అతనికి జైలే సరైనదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన అసోంలోని నౌగావ్ ప్రాంతంలో జరిగింది. భార్య చనిపోవడంతో ఒంటరిగా తొమ్మిది సంవత్సరాల బిడ్డతో ఉంటున్న ఓ తండ్రి, ఆమెపై అత్యాచారానికి దిగాడు. పదేపదే దారుణంగా ప్రవర్తించాడు.

తండ్రి చేష్టలను భరించలేకపోయిన పాప, 2017లో ఇంట్లోంచి పారిపోయింది. సమీప ప్రభుత్వాసుపత్రి నర్సులు చేరదీయడంతో, తాను అనుభవిస్తున్న బాధను చెప్పి బావురుమంది. దీంతో ఆ నర్సులు పాపకు రక్షణ కల్పించి, పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టి, చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ దాదాపు రెండున్నరేళ్లు సాగగా, తాజాగా తీర్పు వెలువడింది.

More Telugu News