Gold: ఇస్ట్రీ పెట్టెల్లో బంగారం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

  • దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు
  • నాలుగు ఇస్త్రీపెట్టెల్లో 9.2 కిలోల బంగారం అక్రమ రవాణా
  • బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అంచనా

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా 9.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడు 4 ఇస్త్రీ పెట్టెల్లో బంగారం దాచి రవాణా చేస్తుండడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News