Jaguar: జాగ్వార్ అడిగితే బీఎండబ్ల్యూ కొనిచ్చిన తండ్రి.. కోపంతో కారును నదిలో పడేసిన కొడుకు!

  • హరియాణాలోని యమునానగర్‌లో ఘటన
  • కారును నదిలోకి తోస్తూ వీడియో
  • సోషల్ మీడియాలో వైరల్

తండ్రిని జాగ్వార్ కారు అడిగితే బీఎండబ్ల్యూ కారు కొనిచ్చాడన్న కోపంతో ఓ యువకుడు కొత్తకారును నదిలో పడేశాడు. హరియాణాలోని యమునానగర్‌లో శుక్రవారం జరిగిందీ ఘటన. రూ.35 లక్షలకు పైగా విలువ చేసే  హై-ఎండ్ బీఎండబ్ల్యూ కారును నదిలోకి తోసేస్తూ వీడియో తీసిన యువకుడు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

నదిలో కొంతదూరం కొట్టుకెళ్లిన కారు ఆ తర్వాత మధ్యలో చిక్కుకుపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆ తర్వాత స్థానిక గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News