Indian Navy: అన్ని యుద్ధనౌకలను, బేస్ లను హై అలర్ట్ లో ఉంచిన ఇండియన్ నేవీ

  • ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం
  • సంసిద్ధంగా ఉన్న ఆర్మీ, నేవీ
  • శాంతికి విఘాతం కలిగిస్తే అంతు చూస్తామన్న కేజేఎస్ ధిల్లాన్

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్న నేపథ్యంలో ఇండియన్ నేవీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అన్ని యుద్ధనౌకలు, బేస్ లను హైఅలర్ట్ లో ఉంచింది.

మరోవైపు ఈ ఉదయం లెఫ్టినెంట్ కేజేఎస్ ధిల్లాన్ మాట్లాడుతూ, సాయుధ బలగాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి కుట్రనైనా ఎదుర్కొనేందుకు పూర్థి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నించినా... వారి అంతు చూస్తామని హెచ్చరించారు.

More Telugu News