Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. అర్ధరాత్రి కూలిన మూడంతస్తుల భవనం.. నలుగురి దుర్మరణం

  • ఖేడా జిల్లాలో ఘటన
  • భవనంలో ఐదు కుటుంబాలు 
  • మృతుల్లో బాలిక

భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మూడంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న 9 మందిని రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఓ బాలిక ఉన్నట్టు తెలుస్తోంది. భవనంలో మొత్తం ఐదు కుటుంబాలు నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

More Telugu News