Guntur District: గుంటూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం.. 300 ఏళ్ల నాటి శివాలయం ధ్వంసం!

  • నంది విగ్రహాన్ని, స్తంభాన్ని ధ్వంసం చేసిన దుండగులు
  • గతంలోనూ ఈ ఆలయంలో తవ్వకాలు
  • దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు

గుప్త నిధుల కోసం మూడు శతాబ్దాల నాటి శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అచ్చంపేట మండలంలోని వేల్పూరు శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాచీన శివాలయంలో గుప్త నిధులు ఉన్నట్టు భావించిన దుండగులు తవ్వకాలు జరిపారు. ఓ స్తంభాన్ని, శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో గతంలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆలయ పూజారి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News