Dhanush: అదృశ్యమైన ఏలేశ్వరం బాలుడు ధనుష్ కనిపించాడు!

  • గురువారం బడికి వెళ్లి తిరిగి రాని బాలుడు
  • ఏలేశ్వరం డిగ్రీ కళాశాల సమీపంలో గాయాలతో పడి ఉన్న ధనుష్
  • గాయాలు ఎలా అయ్యాయన్న దానిపై పోలీసుల ఆరా

గురువారం బడికి వెళ్లి కనిపించకుండా పోయిన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామానికి చెందిన బాలుడు ధనుశ్ (11) కనిపించాడు. ఏలేశ్వరం డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప గాయాలతో పడివున్న బాలుడిని గుర్తించిన పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఏలేశ్వరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ధనుశ్ గురువారం పాఠశాలకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. సాయంత్రమైనా కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు నిన్న డిగ్రీ కళాశాల సమీపంలో పడివుండగా గుర్తించారు. ధనుశ్ ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

More Telugu News