Srisailam: శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత.. సందర్శకుల కేరింతలు!

  • మంత్రి అనిల్ సమక్షంలో 4 గేట్లు ఎత్తిన అధికారులు
  • 1.06 లక్షల క్కూసెక్కుల నీరు దిగువకు విడుదల
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రులు  

శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేశారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 1.06 లక్షల క్కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

అంతకుముందు, ప్రాజెక్టు గేట్ల వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సుందర దృశ్యాలను చూస్తూ కేరింతలు కొట్టిన సందర్శకులు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. 

More Telugu News