Modi: భూటాన్ పర్యటనకు వెళ్లనున్న మోదీ

  • ఈ నెల 17న భూటాన్ వెళ్లనున్న మోదీ
  • రెండు రోజుల పర్యటన 
  • మోదీని ఆహ్వానించిన భూటాన్ ప్రధాని

ఈ నెల 17న ప్రధాని మోదీ భూటాన్ కు పయనమవుతున్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. భూటాన్ ప్రధాని లొటయ్ త్సెరింగ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్, మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ లతో మోదీ సమావేశమవుతారు. ఆ దేశ ప్రధానితో భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. భూటాన్ తో భారత్ కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మరోసారి చాటిచెప్పేలా మోదీ భూటాన్ పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం అనేది మోదీ నినాదమన్నది తెలిసిందే. ఇందులో భాగంగానే తాను రెండో సారి ప్రధాని అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే మోదీ భూటాన్ కు వెళ్తున్నారు.

More Telugu News