Vijay malya: అప్పంతా నయాపైసా సహా చెల్లిస్తా: విజయ్ మాల్యా

  • వందశాతం బ్యాంకులకు కట్టేస్తా
  • ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన మాల్యా
  • ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఈడీ కృషి

ఇండియాలోని బ్యాంకుల నుంచి తాను తీసుకున్న అప్పులన్నీ తిరిగి చెల్లించేస్తానని యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ప్రకటించారు. తీసుకున్న రుణాన్ని వందశాతం బ్యాంకులకు కట్టేందుకు తాను సిద్ధమని చెబుతూ, మాల్యా ఓ ట్వీట్ చేశారు. పాత బకాయిల వసూలుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో మాల్యా ఈ ట్వీట్ చేశారు. కాగా, భారత బ్యాంకులకు మాల్యా సుమారు రూ. 9 వేల కోట్లను చెల్లించాల్సి వుంది. ఈ డబ్బులను కట్టకుండా లండన్ పారిపోయిన ఆయన్ను, ఎలాగైనా ఇండియాకు తిరిగి రప్పించేందుకు బ్రిటన్ కోర్టుల్లో భారత్ తరఫున సీబీఐ, ఈడీ న్యాయ పోరాటం చేస్తున్నాయి. 

More Telugu News