Jagan: ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరిన జగన్

  • వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలి
  • అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రాంట్లు ఇవ్వండి
  • కేంద్ర మంత్రులను కోరిన జగన్

ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన ఏపీ ముుఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని, కొత్త రహదారుల నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

More Telugu News