Junior Doctors: జూడాలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై హోం మంత్రి, డీజీపీకి ఫిర్యాదు

  • సుచరిత, సవాంగ్ కు కలిసిన ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్
  • జూడాలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు
  • విచారణ నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై జూడాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ ను ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కలిసింది. ఈ విషయమై వారికి ఫిర్యాదు చేసింది. దీనిపై సుచరిత స్పందిస్తూ, జూడాలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీ విచారణ చేస్తున్నారని, నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటామని  ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కు ఆమె హామీ ఇచ్చారు.

More Telugu News