Jammu And Kashmir: భారత్ హై కమీషనర్ ని బహిష్కరించిన పాకిస్థాన్

  • భారత్ పై ఆక్రోశం వెళ్లగక్కుతున్న పాక్
  • దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయం 
  • తమ హై కమిషనర్ ను వెనక్కు పిలవనున్న పాక్ 

జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం తీసుకురావడం, ఆర్టికల్ 370, 35-A రద్దుతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తో దౌత్య సంబంధాలు తగ్గించాలని, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని తాజా నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్, ఆ దేశంలో భారత రాయబారిని బహిష్కరించింది. మన రాయబారిని వెనక్కి వెళ్లిపోవాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఢిల్లీలోని తమ హై కమిషనర్ ను వెనక్కు పిలవాలని పాక్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

More Telugu News