Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీకొన్న ఆరు కార్లు.. ఐదుగురి మృతి!

  • తిరుచ్చి-పుదుక్కొట్టె మార్గంలో ప్రమాద ఘటన
  • టైరు పంక్చర్ అవడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టిన కారు 
  • దాని వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీ  

తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-పుదుక్కొట్టె మార్గంలో వరుసగా ఆరు కార్లు ఒక దానినొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిందని చెప్పారు. దీంతో, ఆ కారు వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నట్టు తెలిపారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

More Telugu News