Smruti Irani: అక్కా... నాకిచ్చిన మాట నెరవేర్చకుండానే వెళ్లిపోయావా?: స్మృతీ ఇరానీ భావోద్వేగం

  • నన్ను రెస్టారెంట్ కు తీసుకెళ్తానని చెప్పావు
  • ఆ ప్రామిస్ నెరవేర్చకుండా వెళ్లిపోతావా?
  • నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది
  • ట్విట్టర్ లో స్మృతీ ఇరానీ

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతిపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుష్మను ప్రేమగా అక్కా (దీదీ) అని పిలిచే స్మృతి, ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెడుతూ సుష్మాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది అక్కా. బన్సూరీతో కలిసి నన్ను రెస్టారెంట్ కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు" అని ఆమె ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో ఇద్దరూ కేంద్ర మంత్రులుగా కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.  

More Telugu News