Prabhas: రామోజీ ఫిలిం సిటీలో 'సాహో' ప్రీ రిలీజ్ వేడుక

  • 400 కోట్ల బడ్జెట్ తో 'సాహో'
  • ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్?
  • ఈ నెల 30న నాలుగు భాషల్లో విడుదల

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందింది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. ఈ సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు వున్నాయి. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. 

More Telugu News