India: సుష్మా స్వరాజ్ తో ట్విట్టర్ యుద్ధాన్ని మిస్ అవుతా!: పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్

  • పాక్ లో హిందూ బాలికల కిడ్నాప్ పై సుష్మ ఆగ్రహం
  • ఆమె ఆరోపణల్ని తిప్పికొట్టిన ఫవాద్
  • తాజాగా సుష్మ మరణంతో స్పందించిన నేత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిన్న గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాజ్ హుస్సేన్ సుష్మ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సుష్మా స్వరాజ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆమెతో ట్విట్టర్ యుద్ధాన్ని నేను మిస్ అవుతా. సుష్మ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా పోరాడే వ్యక్తి’ అని ప్రశంసించారు. పాక్ లో మైనారిటీలైన హిందూ యువతులను ఎత్తుకెళ్లి బలవంతంగా మాతమార్పిడి చేపట్టి వివాహం చేసుకుంటున్నారని సుష్మ ట్విట్టర్ లో విమర్శించారు. ఫవాజ్ దాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్విట్టర్ లో చిన్నస్థాయి యుద్దం నడిచింది. దాన్నే తాజాగా ఫవాద్ ప్రస్తావించారు.

More Telugu News