Kurnool District: వాళ్ల పొలంలో మహిళకు దొరికిన వజ్రం.. భారీ మొత్తానికి కొనుగోలు చేసిన వ్యాపారి

  • ఆరు క్యారెట్ల బరువున్న వజ్రం
  • రూ. 4 లక్షల నగదు, మూడు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు
  • ఇటీవల ఓ కూలికి దొరికిన వజ్రం ఖరీదు రూ.13 లక్షలు

కర్నూలు జిల్లా తుగ్గలి మండల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే పండగే. ఈ ప్రాంతంలోని పొలాల్లో వర్షాలు ప్రారంభం కాగానే వజ్రాల వేట మొదలవుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాదు, ఎక్కడెక్కడి నుంచే వచ్చి మరీ వజ్రాల కోసం పొలాల్లో వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయల విలువ చేసే వజ్రాలు దొరకడం మామూలే.

తాజాగా, పగిడిరాయి గ్రామానికి చెందిన ఓ మహిళకు తన పొలంలో ఆరు క్యారెట్ల బరువున్న వజ్రం దొరికింది. విషయం తెలియడంతో వెంటనే వాలిపోయిన అనంతపురం జిల్లా గుత్తి వ్యాపారులు నాలుగు లక్షల రూపాయల నగదు, మూడు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇంతకుముందు ఓ వ్యవసాయ కూలీకి రూ.13 లక్షల విలువైన వజ్రం దొరికింది.  

More Telugu News