India: భారత్-వెస్టిండీస్ మూడో టి20 మ్యాచ్ కి వాన పోటు

  • ఇంకా ప్రారంభం కాని మ్యాచ్
  • మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోన్న ప్రావిడెన్స్  
  • ఉదయం నుంచి వర్షం
  • ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత్

టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడో టి20 మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గయానాలోని ప్రావిడెన్స్ లో జరగాల్సిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఆగితే అంపైర్లు మైదానాన్ని పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో చేజిక్కించుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన తొలి రెండు టి20 మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది.

More Telugu News