Nagarjuna: పుకార్లను పట్టించుకునే అలవాటు లేదు: హీరోయిన్ రకుల్

  • తెలుగులో అవకాశాలు తగ్గలేదు 
  • హిందీలో అవకాశాలు పెరిగాయి
  • నటీనటులకు భాషతో సంబంధం లేదన్న రకుల్

ఈ నెల 9వ తేదీన 'మన్మథుడు 2' సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున జోడీగా రకుల్ నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఇటీవల కాలంలో నేను బాలీవుడ్ ప్రాజెక్టుల నిమిత్తం అక్కడే ఎక్కువగా ఉంటున్నాను. తెలుగులో అవకాశాలు తగ్గడం వల్లనే హిందీలో అవకాశాల కోసం తిరుగుతున్నాననే ప్రచారం జరుగుతోంది.

కొంతమంది కథానాయికల విషయంలో అలా జరిగిందేమో. కానీ నా విషయంలో అలాంటిదేమీ లేదు. టాలీవుడ్లో నా క్రేజ్ చూసే నన్ను పిలిచి మరీ బాలీవుడ్ వారు అవకాశాలు ఇస్తున్నారు. నటీనటులకు భాషతో సంబంధం లేదు. ఎక్కడి నుంచి మంచి అవకాశం వచ్చినా అందుకోవాలి. నేను అదే పని చేస్తుంటే ఇలా పుకార్లు సృష్టిస్తున్నారు. అయినా ఇలాంటి పుకార్లను పట్టించుకునే అలవాటు నాకు లేదు. నా పని నేను చేసుకుపోతుంటాను అంతే" అని చెప్పుకొచ్చింది.

More Telugu News