Karthikeya: ఏ హీరో సినిమా చూస్తే ఆ హీరోలా ఫీలయ్యేవాడిని: హీరో కార్తికేయ

  • చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం 
  • బీటెక్ పూర్తికాగానే ఇండస్ట్రీకి వచ్చాను
  •  పూరితో సినిమా చేస్తాననే నమ్మకం వుంది

కార్తికేయ తాజా చిత్రంగా రూపొందిన 'గుణ 369' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కార్తికేయ మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. వరంగల్ లో బీటెక్ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం .. డాన్సులు బాగా చేసేవాడిని.

ఏ హీరో సినిమా చూస్తే ఆ హీరోలా ఫీలైపోయేవాడిని. ఆ హీరో ప్రభావం నాపై కొన్ని రోజులు ఉండేది. చిరంజీవిగారి 'ఇంద్ర' చూసిన తరువాత అలాంటి ఎక్స్ ప్రెషన్స్ తో .. స్టైల్ తో అలాగే మాట్లాడేవాడిని. ఆ సినిమాలో ఆయనలాగే కాలుమీద కాలేసుకుని కూర్చునేవాడిని. బీటెక్ పూర్తికాగానే అవకాశాల కోసం వేటాడటం మొదలెట్టడం .. ఆ ప్రయత్నాలు ఫలించడం జరిగింది. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లలో పూరిగారితో తప్పకుండా సినిమా చేస్తాననే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News