Nagarjuna: 'మన్మథుడు 2' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'మన్మథుడు 2'
  • సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల 

నాగార్జున కథానాయకుడిగా 'మన్మథుడు 2' నిర్మితమైంది. రకుల్ కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రలో నటించగా, ప్రత్యేకమైన పాత్రలో సమంత కనిపించనుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"మా చక్కని పెళ్లంట .. ముచ్చటైన జంట కన్నులకి వైభోగమే' అంటూ ఈ పాట సాగుతోంది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన బాణీ .. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం కొత్తగా అనిపిస్తున్నాయి. అనురాగ్ కులకర్ణి .. చిన్మయి .. దీప్తి పార్థసారథి ఆలాపనతో ఈ పాట సందడిగా సాగింది. గతంలో నాగ్ చేసిన 'మన్మథుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇది ఆ సినిమాకి సీక్వెల్ కాకపోయినా, అంచనాలు భారీగానే వున్నాయి.

More Telugu News