Jammu And Kashmir: కశ్మీరీ పండిట్స్ కు పునరావాసం కల్పిస్తేనే ఈ బిల్లుకు అర్థం: మురళీ మనోహర్ జోషి

  • ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ సభ్యులు హర్షం
  • రాజ్యసభలో జోరుగా కొనసాగుతోన్న చర్చ
  • వాజ్ పేయి కల అప్పుడే సాకారం అవుతుంది: జోషి

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందిస్తూ, కశ్మీరీ పండితులకు పునరావాసం కల్పిస్తేనే ఈ బిల్లుకు అర్థం అని, వాజ్ పేయి ఆశించిన కశ్మీర్ కల అప్పుడే సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా, జమ్ముకశ్మీర్ పునర్విభజన రద్దు బిల్లుపై రాజ్యసభలో జోరుగా చర్చ సాగుతోంది. కాసేపట్లో ఈ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో అమిత్ షా ప్రసంగిస్తున్నారు. 

More Telugu News