Subramanian Swamy: ఆర్టికల్ 370 నేటితో చచ్చిపోయింది... దాంతో పాటే 35A కూడా!: సుబ్రహ్మణ్యస్వామి

  • కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
  • రాజ్యాంగ సవరణ అవసరంలేదని గతంలోనే చెప్పానన్న స్వామి
  • తాను చెప్పిందే ఇప్పుడు నిరూపితమైందంటూ ట్వీట్

కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎన్డీయే ప్రభుత్వం  రద్దు చేయడం పట్ల బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఆర్టికల్ 370 ఈ రోజుతో చచ్చిపోయిందని, దాంతో పాటే 35A కూడా అంతరించిపోయిందని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరంలేదని తాను గతంలోనే చెప్పిన విషయం ఇప్పుడు నిరూపితమైందని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ తీర్మానం రూపంలో ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని పార్లమెంటు ముందు ఉంచారని, దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందని పేర్కొన్నారు. 

More Telugu News