Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో జాయినైన బండ్ల గణేశ్

  • కమెడియన్ గా బండ్ల గణేశ్ కెరియర్ ప్రారంభం
  • భారీ చిత్రాల నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు 
  • మహేశ్ మూవీతో నటుడిగా రీ ఎంట్రీ

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను రూపొందిస్తున్నాడు. మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే ఈ సినిమాలో ఆయన జోడీగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో బండ్ల గణేశ్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కెరియర్ ఆరంభంలో కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన గణేశ్, ఆ తరువాత బడా నిర్మాతగా మారిపోయి భారీ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన, 'సరిలేరు నీకెవ్వరు'తో నటుడిగా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యాడు. విజయశాంతి కూడా ఈ సినిమా ద్వారానే రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News