Narendra Modi: 7న జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ!

  • బుధవారం నాడు అఖిలపక్ష భేటీ
  • ఆ వెంటనే మోదీ ప్రసంగం
  • ఏం చెబుతారోనన్న ఉత్కంఠ

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కట్టబట్టే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రపతి సంతకం పెట్టిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. 7వ తేదీ, బుధవారం నాడు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆర్టికల్ రద్దుకు దారితీసిన పూర్వపరాలను, ప్రభుత్వం తీసుకోనున్న తదుపరి నిర్ణయాలపై ఆయన వెల్లడిస్తారని సమాచారం. ఇదే సమయంలో బుధవారం నాడు అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ తేదీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ నోటివెంట ఎటువంటి అనూహ్య నిర్ణయాలు వెలువడాల్సి వస్తుందోనన్న ఉత్కంఠ మొదలైంది.

More Telugu News