Bellamkonda Srinivas: నైజామ్ లో 'రాక్షసుడు' 3 రోజుల వసూళ్లు

  • ఈ నెల 2న విడుదలైన 'రాక్షసుడు'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రాక్షసుడు' ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని అంటున్నారు.

నైజామ్ లో ఈ సినిమాకి మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తుండటం విశేషం. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 2 కోట్ల 12 లక్షలకి పైగా షేర్ ను వసూలు చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి ఇవి చెప్పుకోదగిన వసూళ్లేనని అంటున్నారు. 'గుణ 369' మినహా మరే సినిమా ఈ వారాంతం వరకూ పోటీ లేకపోవడంతో, 'రాక్షసుడు' మరింత ఎక్కువ వసూళ్లను సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. బెల్లంకొండకి ఈ సినిమా ఊరటనిచ్చిందనే అంటున్నారు.

More Telugu News