TTD: హైదరాబాద్‌లో ఎస్వీబీసీ స్టూడియో.. ప్రారంభించిన ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ

హిమాయత్ నగర్‌లోని టీటీడీ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని హామీ

ఎస్వీబీసీ చైర్మన్ కావడం ఆనందంగా ఉన్న పృథ్వీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) స్టూడియో హైదరాబాద్‌లో ఏర్పాటైంది. హిమాయత్‌నగర్‌ టీటీడీ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భక్తి చానల్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

More Telugu News