mumbai: యువతిపై నలుగురు యువకుల అత్యాచారం.. బర్త్ డే చేసుకుని ఇంటికి వస్తుండగా ఘటన

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • దారికాచి యువతిపై దారుణం
  • తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు

ముంబైలో గత నెల 7న జరిగిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని చెంబూరు ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటోంది. ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తనే కుమిలిపోతూ, ఏడుస్తూ కనిపించడంతో తల్లిదండ్రులు అనుమానించారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఔరంగాబాద్ ఆసుపత్రిలో యువతిని చేర్చారు. మరికొన్ని రోజులు నిర్లక్ష్యం చేసి ఉంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయి ఉండేదని వైద్యులు చెప్పారు. బాధిత యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..

జూలై 7న బర్త్ డే జరుపుకుని ఇంటికి వస్తున్న యువతిని అడ్డగించిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, రాక్షసంగా ప్రవర్తించడంతో ఆమె శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. పక్షవాతం రావడంతో నాలుక, కాలు పనిచేయడం మానేశాయి. తమ కుమార్తె స్పందించడం లేదని, మాట్లాడలేకపోతోందని చెబుతూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News