Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద.. బిడ్డల కిడ్నాప్ యత్నం ... వెంటాడి పట్టుకున్న తల్లిదండ్రులు!

  • హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన
  • ముంబై నుంచి వచ్చిన కుటుంబం
  • పిల్లలున్న క్యాబ్ తో పారిపోయేందుకు యత్నించిన డ్రైవర్

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఉదయం జరిగిన కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. తమ బిడ్డలను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, తల్లిదండ్రులు కిడ్నాపర్ ను వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ముంబై నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చిన కుటుంబం, నగరంలోకి వెళ్లేందుకు రెండు వేరువేరు క్యాబ్ లను బుక్ చేసుకుంది.

పెద్దలు ఓ క్యాబ్ లో, పిల్లలు మరో క్యాబ్ లో ఎక్కగా, పిల్లలున్న క్యాబ్ తో పారిపోయేందుకు క్యాబ్ డ్రైవర్ ప్రయత్నించాడు. క్యాబ్ దారి మళ్లిందని గుర్తించిన తల్లిదండ్రులు, కారును వెంటాడి పట్టుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారూ రంగంలోకి దిగారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ అనంతరం ఆ కారును నిలువరించి, డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు.

More Telugu News