Chandrababu: భువనేశ్వరితో కలిసి అమెరికాలోని రెస్టారెంట్‌లో భోజనం చేసిన చంద్రబాబు.. వైరల్ అవుతున్న ఫొటో

  • మిన్సెసొటాలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి
  • మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు సంఘాల ప్రతినిధులు
  • ఫొటో చూసి సంబరపడిపోతున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు 

అమెరికా వెళ్లిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం నాడు మిన్నెసొట రాష్ట్రంలోని మేయా క్లినిక్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు  జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

కాగా, చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. వారు భోజనం చేస్తుండగా ఎవరో ఫొటో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కుటుంబంతో కలిసి గడిపే సమయం ఇన్నాళ్లకు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.  

More Telugu News