Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై లోకేశ్ ప్రశంసలు

  • ‘అన్న క్యాంటీన్’లు మూసివేస్తారన్న ఆరోపణలపై నిరసన
  • పేదలకు భోజనాలు ఏర్పాటు చేసిన రామానాయుడు
  • టీడీపీ పేదల పక్షాన నిలుస్తుందని మరోసారి నిరూపించారు

ఏపీలో అత్యంత చవకగా భోజనం అందిస్తున్న‘అన్న క్యాంటీన్’లను ప్రభుత్వం మూసివేస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. పేదల ఆకలి తీర్చి నిరసన వ్యక్తం చేసిన రామానాయుడుకి తన అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలిచి, నిబద్ధతతో పోరాడుతుందని మరోసారి నిరూపించారని ఆయన్ని ప్రశంసించారు.

More Telugu News