Yediyurappa: హైదరాబాద్ వచ్చిన యడియూరప్ప... రేపు చినజీయర్ ఆశ్రమంలో యాగం

  • కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప
  • చినజీయర్ ఆశీస్సుల కోసం హైదరాబాద్ రాక
  • రాత్రికి చినజీయర్ ఆశ్రమంలోనే బస

కర్ణాటక రాజకీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం తెలిసిందే. యడియూరప్ప మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఈ నేపథ్యంలో త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సుల కోసం యడియూరప్ప హైదరాబాద్ విచ్చేశారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా చినజీయర్ ఆశ్రయానికి పయనం అయ్యారు. ఈ రాత్రికి చినజీయర్ ఆశ్రమంలో బస చేస్తారు. రేపు ఆశ్రమంలో నిర్వహించే శ్రీయాగంలో పాల్గొంటున్నముఖ్యమంత్రి  యడియూరప్ప స్వామి ఆశీస్సులు అందుకోనున్నారు.

More Telugu News