Charminar: ఆయుర్వేద వైద్య విద్యార్థినుల ఆందోళన ఘటన.. కానిస్టేబుల్ సస్పెన్షన్

  • ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్
  • పరమేశ్వరన్ పై సస్పెన్షన్ వేటు 
  • ఈ ఘటనపై దర్యాప్తునకు సీపీ ఆదేశాలు

చార్మినార్ లోని ఆయుర్వేద భవన్ ని తరలించ వద్దని నిన్న అక్కడి వైద్య విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులను అరెస్టు చేసే సమయంలో కానిస్టేబుల్ పరమేశ్వరన్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకున్నారు. చార్మినార్ పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ గా చేస్తున్న పరమేశ్వరన్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సౌత్ జోన్ డీసీపీకి సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

More Telugu News