Bhuma akhilapriya: ‘భూమా’ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డి.. ప్రకటించిన అఖిలప్రియ

  • భూమా కుటుంబం ఎప్పటికీ విడిపోదు
  • విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారికి నిరాశే
  • నేను ఎప్పటికీ టీడీపీలోనే

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రాజకీయ వారసుడిగా తన తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రకటించారు. మంగళవారం ఆళ్లగడ్డలోని తన స్వగృహంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూమా కుటుంబం ఎప్పటికీ విడిపోదన్నారు. కుటుంబాన్ని చీల్చాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల వారసుడిగా  భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డిని ప్రకటించారు.

తన కోసం నష్టపోయినవారు ఎంతోమంది ఉన్నారని, వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా అఖిలప్రియ హామీ ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న పుకార్లను నమ్మొద్దని కార్యకర్తలను కోరారు.

More Telugu News