Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజమహేంద్రవరంలో శంకర్ షూటింగ్ 
  • 'కేజీఎఫ్' హీరోతో పూరి ప్రాజక్ట్ 
  • బయోపిక్ నిర్మాణంలో రానా    

*  శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'భారతీయుడు 2' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల 19 నుంచి రాజమహేంద్రవరం పరిసరాల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంటారట.
*  మహేశ్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ 'జనగణమన' చిత్రాన్ని ప్లాన్ చేయాలని భావించడం, మహేశ్ దానిని తిరస్కరించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రాన్ని 'కేజీఎఫ్' ఫేం యష్ హీరోగా చేయాలని పూరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.
*  ప్రఖ్యాత శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవిత కథను వివిధ భాషలలో తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో హీరో రానా దగ్గుబాటి కూడా ఇప్పుడు భాగస్వామి అయినట్టు తెలుస్తోంది.

More Telugu News