Rashmika: తల్లిని ట్వీట్లు పెట్టడం ఆపమన్న రష్మిక!

  • తాము గర్వపడేలా చేసిందన్న రష్మిక తల్లి
  • తదుపరి చిత్రాలకు కూడా ఆల్ ది బెస్ట్
  • మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు

తన సినిమాను చూసి తల్లి ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతుండటంపై ప్రముఖ నటి రష్మిక స్పందించింది. తనకు ఫోన్ ఉందని, ఏమైనా ఉంటే ఫోన్‌లో చెప్పాలని ట్వీట్లు చదివే వారికి ఇబ్బందికరంగా ఉంటాయని పేర్కొంటూ రష్మిక తన తల్లి సుమన్ ఆనందానికి బ్రేకులు వేసింది. అసలు విషయంలోకి వెళితే, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని చూసిన సుమన్, సినిమాలో రష్మికను ఆమె పాత్ర పేరుతో పిలుస్తూ ట్వీట్ చేశారు.

లిల్లీ తన తల్లిదండ్రులు గర్వపడేలా చేసిందని, తాను ఎంచుకున్న రంగంలో ఇలా వృద్ధి చెందుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. లవ్‌ యూ బేబీ రష్మిక, నిజంగా చాలా బాగా నటించావంటూ ప్రశంసించారు. తదుపరి చిత్రాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ, మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి తన సినిమా చూసి న్యూ వెర్షన్ ఎలా ఉందో చెప్పాలని రష్మిక తన తల్లి ట్వీట్‌కు కామెంట్ పెట్టింది.

అనంతరం కూడా రష్మిక తల్లి సుమన్ మరో ట్వీట్ చేశారు. అందరి సంతోషం కోసం కష్టపడుతుండమని, తమ ఆశీర్వాదాలు ఎప్పుడూ రష్మికకు ఉంటాయని, నటిగా ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యమంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రష్మిక, నీ దగ్గర ఫోన్ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోమని, తాను తీరికగా ఉన్నానని కాల్ చెయ్యమని కోరింది. నెటిజన్లు ట్వీట్లు చదువుతున్నారని వారికి ఇబ్బందిగా ఉంటుందని తల్లికి సూచించింది.

More Telugu News