Adivi Sesh: 'ఎవరు' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • అడివి శేష్ హీరోగా 'ఎవరు'
  • కీలకమైన పాత్రలో నవీన్
  • ఈ సినిమాపైనే రెజీనా ఆశలు  

అడివి శేష్ కథానాయకుడిగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో 'ఎవరు' రూపొందుతోంది. రెజీనా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"ఎన్నెన్నో కథలే చూసినా .. ఏవేవో కలలే రేగినా .. నిజమనిపించే ముసుగే తీసినా .. మన రూపాలే నిదురే లేచినా" అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ మెలోడీకి, రమేశ్ కుమార్ సాహిత్యాన్ని అందించగా చిన్మయి శ్రీపాద ఆలపించింది. నవీన్ చంద్ర కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, విభిన్నమైన కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కాలంలో కథానాయికగా వెనుకబడిపోయిన రెజీనా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఆమె కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News