Chaitu: దిల్ రాజు నిర్మాణంలో చైతూ సినిమా డౌటేనట!

  • చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి
  •  తరువాత సినిమా శేఖర్ కమ్ములతో

ప్రస్తుతం నాగ చైతన్య 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ ఒక సినిమా చేయనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఈ సినిమాలో చైతూ సరసన సాయిపల్లవి నటించనుంది.

 తరువాత దిల్ రాజు నిర్మాణంలో చైతూ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో 'శశి' అనే యువ దర్శకుడు పరిచయం కానున్నాడు. తొలుత 'శశి' వినిపించిన కథలో మార్పులు చెప్పిన చైతూ, ఆ తరువాత ఆ కథ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడట. దాంతో మరో కథను తీసుకుని వెళితే నచ్చలేదని చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'మజిలీ' హిట్ నుంచి కథల విషయంలో చైతూ కాస్త గట్టిగానే ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు. 

More Telugu News