Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ!

  • కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేమన్న సర్కారు
  • ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని ముద్రగడ డిమాండ్
  • కాపులు బానిసలుగా బతకాలా? అని నిలదీత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా మండిపడ్డారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకే 5 శాతం ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ ముఖ్యమంత్రికి ఈరోజు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ, ఈ 5 శాతం రిజర్వేషన్ పై ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాపు జాతి ఎలాంటి కోరికలు, ఆశలు లేకుండా బానిసలుగా బతకాలా? అని ప్రశ్నించారు. కేవలం జగన్ ఇస్తామన్న రూ.2,000 కోట్లకు ఆశపడి కాపులు ఆయనకు ఓటేయలేదని స్పష్టం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా కోర్టు స్టే ఇచ్చి వుంటే 2024 వరకూ కాపుల హక్కులపై మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు.

More Telugu News