Jagan: నేడు తమ పార్టీ కాపు ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

  • కాపులకు కోటా ఎత్తివేయడంపై చర్చించనున్న సీఎం
  • ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోనున్న జగన్
  • భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చ

వైసీపీకి చెందిన కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ నేడు భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ 5 శాతం కాపు రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం కానున్నారు.

కాపులకు కేటాయించిన కోటాను ఎత్తివేసిన అంశంపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై ముందుకు ఎలా వెళ్లాలనే కార్యాచరణను రూపొందించనున్నారు.

More Telugu News