Karnataka: మాపై అనర్హత వేటు చట్ట విరుద్ధం: జేడీఎస్ నేత విశ్వనాథ్

  • న్యాయం కోసం మేమంతా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
  • విశ్వాసపరీక్షకు మేము సభకు వెళ్లలేదనే వేటు వేశారు
  • సభకు రావాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయలేరు

కర్ణాటకలోని రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత విశ్వనాథ్ మాట్లాడుతూ, తమపై అనర్హత వేటు వేయడం సరికాదని అన్నారు. సభాపతి విధించిన అనర్హత వేటు చట్టవిరుద్ధమని, న్యాయం కోసం తామంతా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, రేపు పిటిషన్ వేస్తామని చెప్పారు. విశ్వాసపరీక్ష సమయంలో తాము సభకు హాజరుకాలేదనే కారణంతో అనర్హత వేటు వేశారని, శాసనసభకు రావాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయలేరని అన్నారు.

More Telugu News