Chinna Rajappa: రాష్ట్రంలో ప్రజారాజ్యం కాదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది: మాజీ హోం మంత్రి చినరాజప్ప

  • కాపుల రిజర్వేషన్ల రద్దు దారుణం
  • వైసీపీ దాడులు పెరిగిపోయాయి
  • ప్రజలే వైసీపీకి బుద్ది చెబుతారు

రాష్ట్రంలో నడిచేది ప్రజారాజ్యం కాదని, పోలీస్ రాజ్యమని మాజీ హోంమంత్రి, టీడీపీ నేత చినరాజప్ప పేర్కొన్నారు. నేడు పశ్చిమగోదావరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాపులకు రిజర్వేషన్ల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత టీడీపీ ప్రభుత్వం కాపుల పోరాటాలను గుర్తించి 5 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఆ రిజర్వేషన్‌ను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగి పోయాయని, ఆ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వారే దానికి బుద్ది చెబుతారని చినరాజప్ప పేర్కొన్నారు.

More Telugu News