Karnataka: రేపు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలి: కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్

  • రేపు విశ్వాసపరీక్ష నిర్వహించాలని సీఎం కోరారు
  • సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలి
  • ఈ నెల 31లోగా ఆర్థికబిల్లు ఆమోదం పొందాల్సి ఉంది

కర్ణాటక సీఎం యడియూరప్ప రేపు విశ్వాసపరీక్ష ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని ఆదేశించారు. రేపు విశ్వాసపరీక్ష నిర్వహించాలని సీఎం యడియూరప్ప కోరారని, ఈ నెల 31లోగా ఆర్థికబిల్లు ఆమోదం పొందాల్సి ఉందని ఆయన చెప్పారని అన్నారు

More Telugu News