Rahul Gandhi: తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్... పొద్దున్నే వార్తవిని బాధపడ్డా: రాహుల్ గాంధీ

  • గత అర్థరాత్రి మరణించిన జైపాల్ రెడ్డి
  • గొప్ప పార్లమెంటేరియన్ అని వ్యాఖ్యానించిన రాహుల్
  • జైపాల్ కుటుంబానికి సంతాపం

తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహామనిషి జైపాల్ రెడ్డని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మరణ వార్తను విన్న తరువాత, ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని వెలిబుచ్చారు. "కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి గారి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. ఆయన ఓ గొప్ప పార్లమెంటేరియన్. తెలంగాణ ముద్దుబిడ్డ. ప్రజాసేవలో జీవితాంతమూ గడిపిన వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

More Telugu News