Andhra Pradesh: జగన్ గారూ.. ఓ విద్యార్థిపై అక్రమ కేసులు పెట్టేస్థాయికి వైసీపీ దిగజారిపోయిందా?: నారా లోకేశ్ ఆగ్రహం

  • వర్ధన్ పై అక్రమ కేసులు బనాయించారు
  • అతనికి నేను, టీడీపీ అండగా ఉంటాం
  • ఇలాంటి పిరికిపంద చర్యలను తిప్పికొడతాం

వర్ధన్ అనే విద్యార్థిపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిపై కేసులు పెట్టే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తాను, టీడీపీ వర్ధన్ కు అండగా ఉంటామని ప్రకటించారు.

ఇలాంటి పిరికిపంద చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. అయితే వర్ధన్ పై వైసీపీ నేతలు ఎప్పుడు, ఎక్కడ కేసులు పెట్టారన్న విషయమై నారా లోకేశ్ స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News