Andhra Pradesh: పొనుగుపాడులో నేడు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన.. 144 సెక్షన్ విధించిన పోలీసులు!

  • టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే దారిలో గోడ
  • అడ్డుగా నిర్మించిన వైసీపీ నేతలు
  • పరిశీలించేందుకు వెళ్లనున్న టీడీపీ కమిటీ

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొనుగుపాడు గ్రామంలో పోలీసులు ఈరోజు 144 సెక్షన్ విధించారు. ఈ ఊరిలో టీడీపీ మద్దతుదారుల ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా వైసీపీ నేతలు గోడ కట్టారన్న కథనాల నేపథ్యంలో అక్కడ పర్యటించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సిద్ధమయింది. ఈరోజు పొనుగుపాడుకు కమిటీ రానున్న నేపథ్యంలో పోలీసులు ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. ఈ వ్యవహారంపై గత నెల 19న టీడీపీ మద్దతుదారులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో గోడ నిర్మాణాన్ని ఆపేయాలని వైసీపీ నేతలకు పోలీసులు స్పష్టం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

More Telugu News