TTD: శ్రీవారికి భారీ విరాళం.. రూ.2.40 కోట్లు అందించిన అజ్ఞాత భక్తుడు!

  • టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేత
  • తన పేరును బయటపెట్టవద్దని కోరిన భక్తుడు
  • శ్రీవారి ఆలయానికి భారీగా ఆదాయం

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.40 కోట్ల విరాళం ఇచ్చాడు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలుసుకున్న సదరు భక్తుడు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశాడు. అయితే తన పేరును మాత్రం బయటపెట్టవద్దని సదరు అజ్ఞాత భక్తుడు కోరాడు. ఇటీవల మరికొందరు భక్తులు కూడా భారీ విరాళాలు అందజేశారు.

More Telugu News