Karnataka: ఈ నెల 29న బలపరీక్షకు సిద్ధమైన సీఎం యడ్యూరప్ప

  • కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప
  • బలపరీక్షకు ముహూర్తం ఖరారు
  • ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ

కర్ణాటక సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప కొన్ని గంటల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, సభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న బలపరీక్షకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. బలపరీక్ష అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఆ తర్వాత సభలో ఆర్థిక బిల్లు ప్రవేశపెడతారని సమాచారం. 

More Telugu News